తెలంగాణలో టెన్షన్..టెన్షన్.. గెలుపెవరిదంటే?

“వరుసగా పది మ్యాచ్‌ల్లో ఓటమెరగని ‘‘టీమ్‌ ఇండియా’’ విశ్వవిజేతగా నిలిచి ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం చతికిలపడింది.మితిమీరిన ఆత్మవిశ్వాసం పరాజయానికి దారితీస్తుందని గతంలో అనేకసార్లు రుజువైంది.  అందులో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఓటమి ఒక తాజా ఉదాహరణ. ఈ ఓటమి తెలంగాణలోని రాజకీయ పార్టీలకూ ఒక పాఠమే. “ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా గెలిచిన బీఆర్‌ఎస్‌ అతి విశ్వాసం ప్రదర్శిస్తే 2023 ఎన్నికల్లో బొక్కబోర్ల పడవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి…

Read More

తెలంగాణాలో అంతుచిక్కని ప్రజానాడీ..

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్టు ): తెలంగాణాలో ‘‘వార్‌’’ వన్‌సైడ్‌గా కనిపించడం లేదు.? కొత్త పోకడలకు అసెంబ్లీ ఎన్నికలు-2023 తెరలేపాయి.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీనా..? త్రిముఖ పోటీనా? అనే మీమాంస కొనసాగుతోంది .  బరిలో నిలిచిన  ప్రధాన పార్టీలు తామంటే  తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్తున్నాయి?కానీ  అధికారం ఎవ్వరికి దక్కుతుందని ఎవ్వరు చెప్పలేని సంకట పరిస్థితి తెలంగాణలో నెలకొంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు గెలు స్తారు..? ఎవ్వరు ప్రతిపక్షంలో నిలుస్తారు …

Read More

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల…

inctelangana:2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ను శుక్రవారం నాడు విడుదల చేసింది. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని మ్యానిఫెస్టో ను విడుదల చేసారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో రూపొందించారు.టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.అభయహస్తం.. మేనిఫెస్టో పేరుతో ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం అంటూ 37 అంశాలతో…

Read More

తెలంగాణ ఎన్నికల్లో కింగ్ మేకర్ “మైనార్టీలు’…

telanganaelections2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీంలు కీలకం కాబోతున్నాారా అంటే అవుననే సమాధానం  వినిపిస్తోంది. పీపుల్స్‌పల్స్‌ సంస్థ బృందం అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో 12 శాతానికి పైగా ఉన్న మైనార్టీలు రానున్న ఎన్నికల్లో కింగ్ మేకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని తేలింది.గత ఎన్నికల గణాంకాలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.  మరి అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు స్థానిక…

Read More

కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా: రేవంత్ రెడ్డి

Telanganaelections2023: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించలేదని రేవంత్‌ ఆరోపించారు.  “తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు…

Read More

సీఎం సన్నిహిత సంస్థ ఇండోసోల్ కంపెనీకి వేల ఎకరాల భూ సంతర్పణ: నాదెండ్ల

APpolitics: ‘అడ్డగోలు వ్యవహారాలు… అడ్డదిడ్డమైన నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు విస్తుగొలిపేలా ఉన్నాయన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రజాధనాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తన అనుకున్న కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి బరి తెగించారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ కంపెనీకి చేసిన భూ కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చట్టాలను, నిబంధనలను గాలికొదిలేసి మరీ ఆ కంపెనీకు లబ్ధి చేకూర్చడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందన్నారు. కేవలం…

Read More

కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై(యాడ్) నిషేధం..

Telanganaelections2023: అధికార పార్టీల ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకు(యాడ్) లను నిషేధించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.ఓడిపోతామని తెలిసి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ ప్రకటనలను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపింది. అంతేకాదు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రకటనలను ఎన్నికల కమీషన్ నిషేదించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే కేవలం మీడియా ఛానెళ్లలో మాత్రమే ప్రకటనలను నిషేదించడంతో…

Read More

భార్యను గెలిపించుకోవాలని ఉత్తమ్ నయా స్కెచ్..

(nancharaiah merugumala senior journalist): గొల్ల మల్లయ్యను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక డెప్యూటీ సీఎం డీకే శివకుమార్, ‘సరిహద్దు నేత’ రఘువీరారెడ్డిని కోదాడ  రప్పించిన ఉత్తమ్‌ రెడ్డి నిజంగా గ్రేట్‌! బీఆరెస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రా పీసీసీ మాజీ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌ రఘువీరారెడ్డిని  శుక్రవారం కోదాడ రప్పించారు నలమాడ…

Read More

మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరు.. కాంగ్రెస్‌దే పైచేయి..!!

లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్కటైన మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఐదు…

Read More

సీఎంగా జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం నాకు రాబోతుంది: మల్లు భట్టి విక్రమార్క

Madhira :ఖమ్మం బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి  రాష్ట్రానికి ముఖ్యమంత్రి  ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ  ఖమ్మం జిల్లాకు బిపిఎల్,  స్పాంజ్ ఐరన్ కంపెనీ, హెవీ వాటర్ ప్లాంట్, ఆనేక పరిశ్రమలు ఇచ్చింది.  మళ్లీ ఆలాంటి అవకాశం ఖమ్మం జిల్లాకు రాబోతుంది. మధిర బిడ్డగా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అలాంటి అభివృద్ధిని ఖమ్మం కు తీసుకువస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన  మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా…

Read More
Optimized by Optimole