చెన్నైకి కోల్ కతా షాక్..తొలి మ్యాచ్లో భారీ విజయం!

ఐపీఎల్ 15 వ సీజన్ నూ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. కోలకతా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్ కు పరిమితమైంది. సగం ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన ఆజట్టును.. ధోనీ(50)…

Read More

ధోని షాకింగ్ డెసిషన్.. నిరాశలో అభిమానులు!

ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ డెసిషన్ అందరినీ విస్మయానికి గురి చేసింది. మరో రెండు రోజుల్లో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకుంటున్నట్లు.. సీఎస్కే ఫ్రాంఛైజీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సీజన్ నుంచి ధోని స్థానంలో.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యత నిర్వర్తించనున్నట్లు వెల్లడించింది. ధోని నిర్ణయంతో.. సీఎస్కే అభిమానులతో పాటు…

Read More

అట్టహాసంగా పద్మ అవార్డులు ప్రధానోత్సవం!

రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌..54 మంది గ్రహీతలకు పద్మ అవార్డులను ప్రధానం చేశారు. అవార్డులను అందుకున్న వారిలో ప్రముఖ యోగా గురువు స్వామి శివానందతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇక పద్మ అవార్డులు ప్రదానోత్సవంలో భాగంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దర్బార్ హాల్లో యోగా గురు స్వామి శివానంద పేరు పిలవగానే ఆయన వచ్చి మొదట ప్రధానమంత్రి…

Read More

‘డూఆర్ డై మ్యాచ్లో’ అదరగొట్టిన మిథాలీ సేన!

ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో డూ ఆర్ డై మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. మంగళవారం బంగ్లాదేశ్​తో జరిగిన పోరులో మిథాలీ జట్టు 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో యస్తికా భాటియా అర్ధశతకంతో రాణిస్తే.. బౌలింగ్​లో స్నేహ్​ రాణా 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారతజట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది….

Read More

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు..!

తెలంగాణలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు తలనొప్పిగా మారింది. అటు పార్టీకి వీర విధేయులం అంటూ సీనియర్ నేతలు భేటీ అయితే? ఇన్నిరోజులు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క.! షోకాజ్‌ నోటీసులకు భయపడేది లేదు. సస్పెండ్ చేసినా తగ్గేది లేదంటూ జగ్గారెడ్డి పీసీసీ రేవంత్ కి సవాల్ విసరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకు సీనియర్ నేతలు ఈ మీటింగ్తో హైకమాండ్ కి ఏం చెప్పదలచుకున్నారు? అసమ్మతి వాదులం కాదు.. మా తాపత్రయం అంతా…

Read More

‘దంగల్ ‘ రికార్డ్ బ్రేక్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ..

1990లో కశ్మీరీ పండిట్ల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఎనిమిదవ రోజు(19.15కోట్లు).. అమిర్ ఖాన్ దంగల్(రూ.18.59 కోట్లు) రికార్డును బ్రేక్ చేసి.. బాహుబలి_2 (19.75)చేరువలో ఉంది. టోటల్గా ఈ సినిమా ఇప్పటివరకూ రూ.116.45 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినిక్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక…

Read More

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!

కర్ణాటకను కుదిపేసిన హిజాబ్‌ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదని..విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హిజాబ్ వివాదంపై తీర్పును వెలువరించింది. కాగా ఈ ఏడాది జనవరిలో, ఉడిపి పాఠశాల్లో హిజాబ్‌ వస్త్రధారణ పై వివాదం చెలరేగింది. దీంతో కొంతమంది బాలికలు…

Read More

శ్రీలంకపై రెండో టెస్టులో భారత్ ఘననిజయం..!

శ్రీలంక తో జరుగుతున్న పింక్‌ బాల్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 447 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీం ఇండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులో దిముత్‌ కరుణరత్నె సెంచరీతో రాణించగా (107).. కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంతో (54) మెరిశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగు.. బుమ్రా మూడు.. అక్షర్‌ పటేల్‌.. రెండు…

Read More

మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!

రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్​ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌కు…

Read More
Optimized by Optimole