‘రిపబ్లిక్ ‘ మూవీ విడుదల డేట్ అనౌన్స్ !
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్ట. తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ జోడి లో నటిస్తుంది.జీ స్టూడియోస్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్లకు మంచి స్పందన లభించింది….