‘రిపబ్లిక్ ‘ మూవీ విడుదల డేట్ అనౌన్స్ !

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్ట. తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ జోడి లో నటిస్తుంది.జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి స్పందన లభించింది….

Read More

పెగాసస్ పై స్పష్టత ఇచ్చినా కేంద్రం!

పార్లమెంటును కుదిపేస్తున్న పెగసస్​ వ్యవహారంపై కేంద్రం మౌనం వీడింది. పెగసస్​ వ్యవహారంపై ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. ఈ స్పైవేర్ తయారీ సంస్థ, ఎన్​ఎస్​ఓ గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు లేవని రాజ్యసభలో స్పష్టం చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రధాని మోదీ సైతం ఆవేదన వ్యక్తం చేసిన రెండు రోజుల్లోనే.. కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక పెగసస్ వ్యవహారంపై సీపీఎం ఎంపీ వి.శివదాసన్‌ రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తూ..ఎన్‌ఎస్‌వో గ్రూప్‌…

Read More

ముగిసిన విశ్వ క్రీడా సంరంభం!

విశ్వ క్రీడా సంగ్రామం ముగిసింది. రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను అలరించిన టోక్యో ఒలింపిక్స్​ ముంగిపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బాణసంచా వెలుగులు పాప్ సంగీతం, సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారత్ నుంచి 10 మంది అథ్లెట్లు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక టోక్యో ఒలంపిక్స్ అద్భుతాలే కాదు ఎన్నో ప్రత్యేకతలతో పాటు సంచలనానికి కేంద్ర బిందువు అయింది. చైనా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలు తమకు తిరుగులేదని మరోసారి చాటిచెప్పాయి. 38 గోల్డ్…

Read More

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో భారత్ 100 ఏళ్ల స్వర్ణం సాకారం!

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద ఏళ్ళ భారత్ కలను నెరవేర్చాడు యువ అథ్లెట్ నీరజ్ చోప్రా. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచి.. మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. మొత్తంగా టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్లు ఈసారి గొప్ప ప్రదర్శన చేశారు. దీంతో ఓ స్వర్ణం.. రెండు రజతాలు.. నాలుగు కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో ఒలంపిక్స్ లో సరికొత్త చరిత్రను లిఖించిన నీరజ్‌ పై ప్రశంసల వర్షం…

Read More

ప్రభాస్ తో స్టెప్స్ వేయనున్న క్యాట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రతేక గీతంలో నటించనుందని టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ సదరు హీరోయిన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సాంగ్ కోసం భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్…

Read More

కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read More

మౌనం వీడిన నటి శిల్పా శెట్టి!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎట్టకేలకు మౌనం వీడింది. తన భర్త రాజ్​కుంద్రా పోర్న్​ చిత్రాల కేసు విషయమై తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆమె కోరింది. కుటుంబ గోపత్యను గౌరవించాలని.. నిజా నిజాలు ఏమిటో తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై ఆసక్తి కాస్త మానుకోవాలని సూచించింది. కొంత మంది మాపై పనికట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్​ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు….

Read More

దేశంలో కోవిడ్ కల్లోలం!

దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. గత నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 80శాతం మేర పెరిగాయి. భారత్‌లో 46జిల్లాల్లో పది శాతానికి పైగా, 53జిల్లాల్లో అయిదు నుంచి పది శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్ అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుదల దృష్ట్యా…

Read More

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు!

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదు కాగా.. 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్​ పాజిటివిటీ రేటు 10శాతంకన్నా ఎక్కువ ఉన్న జిల్లాల్లో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు విధించాలని సూచించింది. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవాలని…..

Read More

నటి శిల్పాశెట్టికి కోర్టులో చుక్కెదురు!

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టికి ముంబయి హైకోర్టులో చుక్కెదురైంది.పోర్న్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్త రాజ్ కుంద్రా పై కొన్ని మీడియా సంస్థల తోపాటు సోషల్​మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం.. “భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదు” అని శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్​ గౌతమ్​ పటేల్​ ఈ విధంగా తెలిపారు. “పోలీసులు…

Read More
Optimized by Optimole