ఢిల్లీ అల్లర్ల లో సిద్దూ పాత్రపై అనుమానం!

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల వెనక బాలీవుడ్ నటుడు ,గాయకుడు దీప్ సిద్దూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని సిద్దు తప్పుదోవ పట్టించాడని.. తన ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టాడాని.. తద్వారా శాంతియుత ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారిందని రైతు సంఘాల పెద్దలు ఆరోపించారు. సిద్దు ఎవరు.. రైతులతో సంబంధం ఏంటి..? పంజాబ్ గాయకుడిగా , బాలీవుడ్ నటుడిగా సిద్దుకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉంది. అతను మంచి వక్త…

Read More

ఆస్కార్ రేసులో ‘ ఆకాశం నీ హద్దురా ‘

ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకత్వం తో పాటు ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం పోటిపడుతుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన బాలమురళి నటించారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించడం విశేషం. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య…

Read More

రైతుల ఆందోళన హింసాత్మకం!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రూట్ మ్యాప్ విషయంలో రైతులు భిన్నంగా వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అల్లరిముకలు భద్రత సిబ్బంది పై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పారమిలటరీ బలగాలను…

Read More

మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…

Read More

ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. అతను నటిస్తున్న మొదటి చిత్రం ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైష్ణవి జోడిగా కన్నడ బ్యూటీ కీర్తి శెట్టి నటిస్తుండగా , ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్…

Read More

దాదా, ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివి : అజింక్య రహానే

ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం లో బీసీసీఐ చైర్మన్ గంగూలీ, ఎంసీఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివని అజింక్య రహానే పేర్కొన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ .. అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి తరువాత దాదా కాల్ చేసి స్పూర్తినిస్తూ మాట్లాడే మాటలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాయని అన్నారు. ఇక గాయాలతో దూరమైన సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు రాణించడానికి కారణం రాహుల్ ద్రావిడ్ అని స్పష్టం చేశారు. యువ…

Read More

‘లవ్ స్టొరీ’ ఏప్రిల్ లో విడుదల!

యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ప్రేమ కథల చిత్రాదర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్…

Read More

మహావీరుడికి ‘మహావీర్ చక్ర’..

రెండు దశాబ్దాల తర్వాత తెలుగు వీరుడు కల్నల్ సంతోష్ బాబుకు అత్యంత ప్రతిష్టాత్మక ‘ మహావీర్ పరమ చక్ర ‘ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆర్మీలో ‘పరమవీరచక్ర ‘ తర్వాత రెండో అత్యున్నత పురస్కారం ఇదే కావడం విశేషం. గత ఏడాది భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిని తిప్పికొట్టే క్రమంలో సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. 16వ రెజిమెంట్ లో విధులు నిర్వహించిన సంతోష్ బాబు స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట. ఆయనకు…

Read More

అక్టోబర్లో ‘ ఆర్ఆర్ఆర్ ‘ విడుదల!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రథిరం(ఆర్ ఆర్ ఆర్) అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు సంబంధించిన చిత్ర పోస్టర్ను సోమవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొమరం భీమ్ గా, జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా, నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ…

Read More

కన్నపేగే కడతేర్చింది!

కాలం మారింది, మనిషి మేధస్సుతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. కానీ ఆలోచనల ధోరణి లో మాత్రం మార్పు రావడం లేదు. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన మూఢనమ్మకాల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అందుకు నిదర్శనమే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన సంఘటన.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలోని నివాసముంటున్న పురుషోత్తం నాయుడు, పద్మజా దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరికి అలేఖ్య సాయి దీప ఇద్దరు కూతుర్లు. తండ్రి కళాశాల ప్రిన్సిపల్ పనిచేస్తుండగా, తల్లి కరస్పాండెంట్ గా పనిచేస్తుంది….

Read More
Optimized by Optimole