కుంగ్ ఫూ పాండ్యా కుమ్మేశాడు .. పాక్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..

భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్లో ఉండే మజాను మరోసారి అస్వాధించారు అభిమానులు. స్వల్ప స్కోర్లు నమోదైన మ్కాచ్లో ఇరుజట్లు గెలుపుకోసం చివరి ఓవర్ వరకూ పోరాడాయి. ఓవైపు చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉండటం.. కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఔటవడంతో భారత్ అభిమానుల్లో టెన్షన్.. మరోవైపు పొదుపైన బౌలింగ్ తో కట్టడి చేస్తున్న ప్రత్యర్థి ఆటగాళ్లు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన కుంగ్ ఫూ పాండ్యా ధనా ధన్ బ్యాటింగ్ మెరుపులు…

Read Full News

ఒక్క త్రో తో భారత్ స్టార్ ప్లేయర్ మూడు రికార్డులు..

జావెలిన్ త్రో ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా మరోసారి అద్భుతం చేశాడు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఛాంపియన్ డైమండ్ లీగ్ మీట్‌లో 89.09 మీటర్లు జావెల్ విసిరి ఔరా అనిపించాడు. దీంతో ఒకేసారి మూడు రికార్డులను నీరజ్ బద్దలు కొట్టాడు.  లాసాన్ స్టేజ్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నిలవడమే కాక.. సెప్టెంబరులో జ్యూరిచ్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు.. వచ్చే ఏడాది హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ…

Read Full News

మరోసారి హాట్ టాపిక్ గా పంత్-ఊర్వశి రౌట్ వ్యవహారం

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా , క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడంతో..ఆమె సోషల్ ఖాతాను బ్లాక్ చేసి పంత్ రూమర్స్​కు చెక్ పెట్టాడు. తాజాగా అతను ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022…

Read Full News

కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు..

కామన్వెల్త్ గేమ్స్‌_2022 లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం అతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌ కి చేరింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయమైంది. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 32 బంతుల్లో…

Read Full News

వెస్టీండీస్ సిరీస్ లో హార్థిక్ పాండ్యా రికార్డుల మోత..

భారత్ స్టార్ ఆటగాడు హార్ధిక్ పాండ్యా వెస్టీండీస్ టీ20 సిరీస్ లో అరురదైన రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 లో 50 వికెట్లు పూర్తి చేసిన భారత ఆరోబౌలర్ గా హార్థిక్ నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20 లో అతను ఈఘనత సాధించారు. అతని కంటే ముందు యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈఫీట్ సాధించారు. ఇక హార్థిక్ అంతర్జాతీయ T20 కెరీర్‌లో 50 వికెట్లు.. 806 పరుగులు…

Read Full News

స్వర్ణపతక వీరుడు ‘నీరజ్’ ప్రస్థానం..

ఒకసారి యుద్ధం మొదలెట్టాక గెలవాలి లేదా ఓడాలి.. ఈడైలాగ్ సరిగ్గా సరిపోతుంది ఆటగాళ్లకి. ఆటలో గెలిచిన వాళ్లు చరిత్ర సృష్టిస్తారు. ఓడినవాళ్లు గుణపాఠాన్ని నేర్చుకుంటారు.జావెలిన్‌ త్రో ఆటగాడు స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ప్రస్థానం అలాంటిందే. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అతను.. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టతను రెపరెపలాడించాడు. తాజాగా అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ 88.13 మీటర్ల మేర జావలిన్‌ విసిరి సిల్వర్‌…

Read Full News

వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన భారత యువ ఆటగాడు..

వన్డే క్రికెట్ చరిత్రలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 1000 పరుగలు సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ రికార్డులోకెక్కాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేల్లో 54 పరుగులు చేసిన శ్రేయస్ ఈమైలురాయిని అధిగమించాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. వన్డేల్లోకి 2017 లో అరంగ్రేటం చేసిన శ్రేయస్ 25 ఇన్నింగ్స్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు….

Read Full News

టెస్ట్ క్రికెట్ పై రవిశాస్త్రి ఆందోళన…

టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టెస్ట్ క్రికెట్ మనుగడపై ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే, టీ20 నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన అన్నారు. తాజాగా ఓస్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ..క్రికెట్ నాణ్యతకు కోలమానమైన టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్లో ఆడే జట్ల సంఖ్యను తగ్గించాలని సూచించాడు. పుట్ బాల్ మాదిరి క్రికెట్.. అనేక లీగులతో దూసుకుపోతుందని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే…

Read Full News

విరాట్ కోహ్లీ ఫామ్ పై రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్. ఎంతంటి స్టార్ ఆటగాడైనా.. ఓ స్టేజ్ కి వచ్చాక గడ్డు పరిస్థితులను ఎదుర్కొక తప్పదన్నాడు. ఖచ్చితంగా విరాట్ ఫామ్ అందిపుచ్చుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు పాంటింగ్. అయితే అతనికి కొంత సమయం ఇవ్వాలని జట్టు మేనేజ్ మెంట్ కి సూచించాడు. టీ20 ప్రపంచకప్ లో కోహ్లీకి బదులు ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకుంటే.. టీంఇండియాకి నష్టమేనని చెప్పకనే చెప్పాడు….

Read Full News

టీంఇండియాకు నెక్ట్స్ కెప్టెన్ పంత్: అరుణ్ లాల్

టీంఇండియాకు కెప్టెన్ కాగల లక్షణాలు పంత్ లో ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గట్టేక్కించగల సమర్థుడు రిషబ్ అంటూ ఆకాశానికెత్తాశాడు. ఓజాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు పంచుకున్నాడు. రిషబ్ ఒత్తిడిని తట్టుకోగలడని.. కఠిన పరిస్థితుల్లో ఆటను ఆడేందుకు ఇష్టపడతాడని అరుణ్ లాల్ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరని అడిగితే .. సందేహం లేకుండా రిషబ్ పేరును ప్రతిపాదిస్తానని బెంగాల్ మాజీ కోచ్ స్పష్టం చేశాడు.రిషబ్…

Read Full News
Optimized by Optimole