చీకటి జీవోను రద్దు చేయండి: ఎంపీ రఘురామ

రాజకీయ పార్టీలు నిర్వహించే  ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ  వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను తక్షణమే  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు. ఈ జీవో రాజ్యాంగంలోని  ఆర్టికల్ 19(1) బి కి పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. 1972లో ముంబై పోలీస్ కమిషనర్ ఇటువంటి జీవో జారీ చేయగా.. హిమ్మత్ లాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే జీవోను కొట్టివేసిందని గుర్తు చేశారు. సాధారణంగా ఇటువంటి జీవోలు  పోలీసులు…

Read More

Telangana: బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చిచ్చు.. తెరపైకి ఉద్యమ కారులు…

Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు  అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. అయితే అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై మీడియాలో కథనాలు రావడంతో కలవరం మొదలైంది.దీంతో ఆయా నియోజక వర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమవేశాలు ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని ప్రెస్ మీట్లు పెట్టి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది చాలాదన్నట్లు సీఎం కెసిఆర్…

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ ..!!

సూర్యాపేట:  సూర్యాపేట-ఖమ్మం హైవేపై ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. మోతే మండలం మామిల్లగూడెం వద్ద కారును ..  బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి  చెందగా.. ఇద్దరికి తీవ్ర  గాయాలయ్యాయి.   బైక్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిది ఖమ్మం జిల్లా అని సమాచారం. వారంతా  హైద్రాబాద్ నుంచి ఖమ్మం వైపు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు . కేసు నమోదు…

Read More

Haryana2024: హర్యానాలో కాంగ్రెస్ కే స్వల్ప ఆధిక్యత.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!

Haryanaelections2024:  ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు. కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈ సారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి…

Read More

తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో ?

Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్‌ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్‌ చివర్లో ఎనిమిదో లోక్‌ సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ…

Read More

tribalsociety: గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ

Raparthy vinod Kumar: అంతరాలను పూడ్చటమే కాదు… వారి వారసత్వం, గిరియువత సాధికారత లక్ష్యం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ.. అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత నిర్లక్ష్యం అనంతరం వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. అంతరాలను పూడ్చడమే కాకుండా.. ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత,…

Read More

తెనాలిలో జ‌న‌సేన నాయ‌కుల అరెస్ట్ అప్రజాస్వామికం : నాదెండ్ల మ‌నోహ‌ర్‌

తెనాలి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమ‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్‌. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయం. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా… వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుందని ఎద్దేవ…

Read More
Optimized by Optimole