ఎన్నికల హామీలు విస్మరించిన కేసిఆర్ గద్దె దిగాలి: షర్మిల

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్షర్మిల డిమాండ్చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాగా 3ఎకరాల భూమి ఇస్తామని దళితులను, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని విద్యార్థులను, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మైనార్టీలను సీఎం మోసం చేశారని అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా…

Read More

ఆహా ఏమి యోగం!

‘జన్మ సార్థకత’ అనే ఓ గొప్ప మాటుంది భారతీయ సంస్కృతిలో. కొంచెం అటిటుగా ప్రపంచపు అన్ని సంస్కృతుల్లోనూ ఇది ఉండే ఉంటుంది. ఇది, అంత తేలిగ్గా అందరికీ లభించదు. లభించడం మహా ఘనతే! ఎందుకంటున్నానంటే… ఇవాళ సాయంత్రం ఓ గంటన్నర సేపు సుమారు 120 కోట్ల మంది (2018 వల్డ్ కప్ ఫైనల్ 112 కోట్ల మంది వీక్షించినట్టు రికార్డు ఉంది) ప్రపంచ జనావళి చూపులు ఓ వ్యక్తి పైన కేంద్రీకృతమౌతున్నాయి. అంతకు రెట్టింపు సంఖ్యలో అంటే,…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం కాస్త త‌గ్గినా బంగారం ధర నేడు మార్కెట్ ధరల్లో స్వ‌ల్ప వ్యత్యాసం కనిపిస్తోంది . అయితే దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌ల్లో మార్పులు క‌నిపిస్తున్నాయి. శనివారం గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, దేశంలో 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 40 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 40 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం…

Read More

భార‌త్ జోడో యాత్ర‌పై ఏపీ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాట‌ల్లో…ఎక్స్ క్లూజివ్‌..!

విద్వేషానికి స్వ‌స్తి.. ప్రేమ‌కు నాంది..!! కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ముగిసింది. క‌న్యా కుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు 140 రోజుల పాటు నిర్వ‌రామంగా 75 జిల్లాల గుండా 4080 కిలో మీట‌ర్ల మేర సాగిన యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింది. రాహుల్ ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగింది. జోడో యాత్రలో రాహుల్ వెంట పాల్గొన‌డాన‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎంపికైనా ఏకైక మ‌హిళ నాయ‌కురాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ‌ర్కింగ్…

Read More

కాంగ్రెస్ ను చావనీయండి గాని నెహ్రూ-గాంధీ ఫ్యామిలీని కాపాడుకోండి!

Nancharaiah Merugumala (senior journalist): ————————————–^——— 2004 నుంచీ చావు దారిన వేగంగా నడుస్తోంది కాంగిరేసు పార్టీ. పదేళ్ల తర్వాత దిల్లీలో అధికారం కోల్పోయింది. నరేంద్రమోదీ ప్రధాని అయినాక కాంగ్రెస్ పతనానికి పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఆమె కొడుకూకూతుళ్లు రాహుల్, ప్రియాంకా పరోక్షంగా కారకులయ్యారు. వారి దివంగత కుటుంబ పెద్ద ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు (1969,1978) చీల్చి దాన్ని బతికించారు. ఈ స్థాయిలో తర్వాత కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ గాని, ఎన్డీ తివారీ-అర్జున్ సింగ్…

Read More

IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!

IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్…

Read More

తృణ‌మూల్ కుట్ర‌లకు పాల్పడుతోంది : ప్ర‌ధాని మోదీ

బెంగాల్ నాలుగో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌లు రక్త‌సిక్త‌మ‌య్యాయి. శ‌నివారం కూచ్‌బెహార్ జిల్లాలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న‌ పోలీసుల నుంచి స్థానికులు తుపాకులు లాక్కొనేందుకు ప్ర‌య‌త్నించడంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. శ‌నివారం ఉద‌యం పోలింగ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికి ఓట్లు వేయ‌డానికి వచ్చిన వారిపై కొంద‌రు రాళ్లు రువ్వార‌ని, భ‌ద్ర‌త బ‌ల‌గాల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగార‌ని, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో పోలీసులు కాల్పులు జ‌రిపిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాక కూచ్‌బెహార్ జిల్లాలోని మ‌రో…

Read More
Optimized by Optimole