దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 44 వేల 877 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో లక్ష 17 వేల 591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. అటు…

Read More

యూపీలో ప్రారంభమైన తొలివిడత పోలింగ్!

దేశంలో అత్యధిక దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. కాగా మొదటి విడతలో భాగంగా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మోదీ ట్వీట్.. యూపీ తొలి విడత ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ…

Read More

కర్ణాటకలో ముదిరిన హిజాబ్ వివాదం!

కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకు తీవ్రమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్ కుఅనుకూల, వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు పలు చోట్ల ఉద్రిక్తకు దారితీసింది. దీంతో విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎం బస్వరాజు బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. అటు హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఈమేరకు ప్రజలు, విద్యార్థులు సంయమనం పాటించాలని ధర్మాసనం సూచించింది. కొందరు అల్లరిమూకలు సమస్యను జఠిలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి…

Read More

భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ..?

భారత జట్టు టెస్ట్ సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న అతనిని.. బీసీసీఐ పూర్తిస్థాయి టెస్టు సారథిగా ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కాగా శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందే సెలెక్షన్ కమిటీ రోహిత్ పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక తో భారత జట్టు 2 టెస్టులు, 3టీ_20లు ఆడనుంది….

Read More

మరో కరోనా వేరియంట్ విరుచుకుపడే అవకాశం:డాక్టర్‌ ఏంజెలిక్‌

దేశంలో కరోనా కేసులు ఇప్పుడిపుడే తగ్గుతున్నాయి. త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందనే ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది. కానీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. మరొక ‘వేరియంట్‌’ రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ హెచ్చరిస్తున్నారు. మళ్లీ వైరస్ విజృంభణకు మ్యుటేషన్లు కారణమని ఆమె స్పష్టం చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించడం ఒమిక్రాన్‌ వేరియంట్ లక్షణమని.. స్వల్ప వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. టీకాలు వేసుకోవడమే ఈ వ్యాధి వ్యాప్తిని…

Read More

యూపీ మరోసారి బీజేపీదే_ అమిత్ షా

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి 300పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా. శుక్రవారం గోరఖ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్షా మాట్లాడుతూ..2014, 2017, 2019 మాదిరి.. ఈ సారి కూడా యూపీలో గెలిచేది బీజేపీ అని అమిత్షా స్పష్టం చేశారు. 2013లో తాను యూపీ బీజేపి ఎన్నికల ఇంచార్జ్గా వచ్చానని.. అప్పుడు అందరూ కనీసం బీజేపికి రెండంకెల సీట్లు వస్తే గొప్ప విషయమన్నారు. కానీ ఎన్నికల తర్వాత…..

Read More

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

దేశంలో కోవిడ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్ష 49వేల 394 కేసులు నమోదయ్యాయి. అటు కరోనా నుంచి 2 లక్షల 46 వేల 674 మంది కోలుకున్నారు. అటు మరణాలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో వెయ్యి 72 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు…

Read More

సరికొత్త పాత్రలో మహేంద్ర సింగ్ ధోనీ!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అదేంటి ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాలేదు! కొత్త పాత్ర ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అది క్రికెట్ కు సంబంధించి కాదండోయ్ ఓ నవలకు సంబంధించి. మహి ప్రధాన పాత్రగా ‘అధర్వ’ అనే నవల రాస్తున్నారు సంగీత దర్శకుడు రమేశ్ తమిళ్మణి. ఇది గ్రాఫిక్ నవల. ఇందులోని ధోనీ ఫస్ట్లుక్ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో కత్తి పట్టి కిర్రాక్ లుక్లో కనిపిస్తున్నారు మహి.ఈ గ్రాఫిక్ నవలను…

Read More

అండర్_19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్..!

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువభారత్‌ జట్టు ఫైనల్ కూ దూసుకెళ్లింది. టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జోరుమీదున్న భారత్‌.. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరింది. దీంతో భారత జట్టు ఎనిమిదో సారి ఫైనల్ చేరినట్లయింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు.. నిర్ణీత ఓవర్లలో 290 పరుగుల చేసింది. కెప్టెన్‌ యష్‌ధూల్‌(110) సెంచరీతో రాణించగా.. వైస్‌కెప్టెన్‌ షేక్‌ రషీద్‌(94) హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో…

Read More

ప్రజామోదం పొందిన ప్రగతిశీల బడ్జెట్_ మోదీ

2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఉపాధి, గృహనిర్మాణం, విద్య తదితర అంశాలకు సంబంధించి పలు భారీ ప్రకటనలు చేశారు ఆర్థికమంత్రి. దేశ సమగ్ర అభివృద్ధికి బడ్జెట్ లోని అంశాలు ఉపకరిస్తాయని పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పడుతుందని కొనియాడారు. పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు…

Read More
Optimized by Optimole