నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘ జాతిరత్నాలు’

మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. రెండో చిత్రం ‘మహానటి’తో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకొని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మూడో చిత్రం తన మామగారు అశ్వినిదత్ ప్రతిష్టాత్మక బ్యానర్ ‘వైజయంతి మూవీస్ బ్యానర్’ 100 వ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్తో తీస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రెండు పార్టులు, ‘సాహో’తో ప్యాన్ ఇండియా హీరోగా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తో అశ్విన్ కలయికలో…

Read More

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు : పవన్ కళ్యాణ్

APpolitics:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయన్నారు జన సేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ  పట్టభద్రుల నియోజక వర్గాల ఎం.ఎల్.సి. స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సందిగ్ధంలో ఉన్నవారికి…

Read More

ర్యాగింగ్ చేస్తే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లో ఉంది: ఎస్పీ అపూర్వ రావు

నల్గొండ: కామినేని మెడికల్ కళాశాలలో ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా,మాదక ద్రవ్యాలు ,యాంటీ ర్యాగింగ్ చట్టాలపై మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ కె.అపూర్వ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో షీ టీమ్స్ బృందాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. జన సమూహాలు .. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో..నిరంతరం పర్యవేక్షిస్తూ, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్…

Read More

‘నాటునాటు’కు ఆస్కారం తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం ..‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా?

Nancharaiah merugumala : (senior journalist) ‘నాటునాటు’కు ఆస్కారంపై ఓ ‘జాతి’ బాధను తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం చేయడం ‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా? తమిళ సోదరుడు ప్రేమ్‌ రక్షిత్, తెలుగు దిగ్గజాలు కనుకుంట్ల సుభాష్‌ చంద్ర బోస్, రాహుల్‌ సిప్లీగంజ్, కోడూరి ఎంఎం కీరవాణి, కోడూరి కాలభైరవ, అందరికన్నా ఎక్కువ శ్రమపడిన కోడూరి కార్తికేయ ఇంకా కోడూరి ఎసెస్‌ రాజమౌళి, వారి కుటుంబ సభ్యులు, అత్యధిక తెలుగు ప్రజానీకం– నిన్నటి నుంచి అనుభవిస్తున్న అతులిత ఆనందాన్ని, ఎల్లలు…

Read More

కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది : బండి సంజయ్

బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి. ================================ లై డిటెక్టర్‌ టెస్ట్‌ కు నేను సిద్ధం..కేసీఆర్‌ సిద్ధమా? ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది. నిజం చెబితే అతని తల వెయ్యి ముక్కలైతదట. అందుకే ఆయన ఏనాడూ ఒక్క నిజం చెప్పరు.. నోరు విప్పితే అబద్దాలే… చేసేవన్నీ మోసాలే…తడిబట్టతో గొంతు కోసే రకం. ఎన్నికలొస్తున్నయంటే… అబద్దాలకు అంతుండదు. కేసీఆర్‌ మార్చే రంగులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడతది. అబద్దాల ప్రచారానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన…

Read More

Telangana: రేగు మల్లేష్ కు సన్మానం…

Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రెండో వార్డ్ మెంబర్ రేగు మల్లేష్ ను సన్మానించిన స్థానిక యువకులు. రానున్న రోజుల్లో వార్డులోని డ్రింకింగ్ వాటర్,సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తానని వార్డ్ మెంబర్ రేగు మల్లేష్ హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న అందుబాటులో ఉండి సర్పంచికి తెలియజేసే బాధ్యత తనదని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను ప్రజలకే అందజేస్తానని దైవసాక్షిగా…

Read More

ప‌ఠాన్ క‌లెక్ష‌న్లు నిజ‌మా? ఫేకా?

బాలీవుడ్ బ‌డా మూవీ ప‌ఠాన్ క‌లెక్ష‌న్ల‌పై నెట్టింట్లో తెగ చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 800 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లను రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈమార్కును తప్పుబడుతున్నారు నెటిజ‌న్స్‌. బాయ్ కాట్ ఎఫెక్ట్ సినిమాపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని.. త‌ప్పుడు లెక్క‌ల‌తో మ‌భ్య‌పెట్టినంత మాత్రాన వాస్త‌వాలను దాచ‌లేర‌ని సెటైరిక‌ల్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ప‌ఠాన్ మూవీకి..మొద‌టివారం మిక్స్ డ్ టాక్ వినిపించింది. బాలీవుడ్ క్రిటిక్స్ మిన‌హా .. మిగ‌తా ఇండ‌స్ట్రీ…

Read More

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ అపూర్వ రావు

నల్లగొండ: జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఎస్పీ అపూర్వ రావు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు. అనంతరం పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కేసుల సంఖ్య తగ్గించి..పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల సత్వర పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి…

Read More
Optimized by Optimole