దేశంలో కాస్త తగ్గినా కరోనా కేసులు…
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్తో మరో 549 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 13 వేల 543 మంది కోలుకున్నారు. ప్రస్తుతం లక్ష 61వేల 555 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Telangana :విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం : ఎస్ఎఫ్ఐ
Atmakur: విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆత్మకూర్ మండల ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు చరణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ చేయడం జరిగిందని అన్నారు. గత నెల రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలవడం.. చనిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు పట్టింపులేనట్లు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ తక్షణమే విచారణకు…
దయానిధి మారన్ యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?
Nancharaiah merugumala senior journalist: ” దేవదాసీ కుల, కుటుంబ నేపథ్యం ఉన్న దయానిధి మారన్..యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?” ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన ఇంగ్లిష్ రాని కార్మికులు తమిళనాడులో టాయిలెట్లు కడుగుగున్నారని డీఎంకే లోక్ సభ సభ్యుడు దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర నిరసనకు కారణమైంది. డీఎంకే నాయకుడు ఎం. కరుణానిధి మేనల్లుడి (అక్క కుమారుడు మురసోలి మారన్) కొడుకైన కేంద్ర మాజీ మంత్రి…
జాతీయ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడా?: బండి సంజయ్
తెలంగాణలో గ్రామపంచాయతీ నిధుల మళ్లింపుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని..జాతీయ అధ్యక్షుడు లేని బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడా? అంటూ ఎద్దేవా చేశారు. ఆహారపు అలవాట్లపై కేసీఆర్ చేసిన అవమానాన్ని ఆంధ్ర ప్రజలు మరచిపోగలరాని?ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల్ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్న కేసీఆర్..తెలంగాణను నాశనం చేసి.. దేశాన్ని ఉద్ధరించడానికి బయల్దేరాడని విమర్శించారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మూసేసి తెలంగాణ ప్రజల దృష్టి…
ఛాన్సులు రావట్లేదంటూ నటి సురేఖవాణి ఎమోషనల్..
Sambashiva Rao: =========== తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. అక్కగా, తల్లిగా తన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి, తన కూతురుతో కలిసి చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. గతంలో ఎక్కువగా సినిమాల్లో నటింంచిన ఈమె.. ఈమధ్య అడపదడప ఒకటో రెండో సినిమాల్లో…
‘యువ గళం ‘ పాదయాత్రకు అపూర్వ స్పందన..
కుప్పం: కుప్పంలో నారా లోకేష్ ‘ యువ గళం ‘ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా సాగింది. యాత్రకు మద్దతుగా.. రైతులు, విద్యార్దులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన టొమాటో లు రోడ్ల మీద పారబోసే పరిస్థితి దాపురించందన్నారు.ఎరువులు ధరలు పెరిగిపోయాయి..డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ఎత్తేసారు…..