Headlines

అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ : మోడీ

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి బడ్జెట్ అని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశం అనంతరం వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో విడుదల చేశారు. బడ్జెట్ లో వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు.. వ్యవసాయరంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బడ్జెట్పై కేంద్ర ఆర్థిక మంత్రి…

Read More

గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దే!

జిహెచ్ఎంసి కొత్త పాలక వర్గం గురువారం కొలువుదిరింది. కొత్తగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి (హైదరాబాద్ కలెక్టర్)శ్వేతా మహంతి నాల్గు భాషల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్గా గెలిచిన మోతె శ్రీలత ఎన్నికయ్యారు. కాగా మేయర్ ఎన్నికకు టీఆరెస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి రాధ పోటీపడ్డారు. మేయర్…

Read More

పాదయాత్రలో భట్టిపై గీత‌న్న‌ల మ‌మ‌కారం..

PeoplesMarch:   సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భట్టికి మద్దతుగా కార్యకర్తలు,అభిమానులు ,ప్రజలు స్వచ్ఛందగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలనే వ‌రంగ‌ల్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌య‌మంలో ఓ గీత కార్మికుడు భ‌ట్టి వ‌ద్ద‌కు వ‌చ్చి.. తాటి ముంజ‌లు తినిపించారు. ఎండ‌న‌క‌, వాన‌న‌క న‌డుస్తూ వ‌స్తున్నారు.. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోండ‌ని ఆప్యాయంగా పలకరించారు. మాకు ఫ్రీ ఎడ్యుకేష‌న్ కావాలి.. అప్ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు…

Read More

తెలంగాణ CS రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్షాలు..

సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయించడాన్ని రద్దుచేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. రాష్ట్ర విభజన తర్వాత DOPT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కేడర్  అధికారులను పక్కనపెట్టి…. ఏపీకి కేటాయించిన అధికారిని సీఎస్  పదవిలో నియమించడం ద్వారా సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని సంజయ్  విమర్శించారు. అటు…

Read More

నవజ్యోత్ సింగ్ సిద్దూ పై సోదరి సంచలన వ్యాఖ్యలు!

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని సిద్ధూ సోదరి సుమన్​ తూర్ ఆరోపించారు. అమెరికా నుంచి చండీగఢ్​ వచ్చిన ఆమె మీడియా సమావేశంలో తన తల్లి పడిన కష్టాలను తెలుపుతూ కన్నీటీ పర్యంతమయ్యారు. ఓ విషాదకర ప్రమాదంలో అక్క, కుటుంబ సభ్యులు మరణిస్తే.. సిద్ధూ కనీసం సంతాపం తెలపలేదన్నారు సుమన్ తూర్ . ఈ…

Read More

పవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్ ‘ లైగర్’..

యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. అనన్య పాండే కథానాయిక. కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్ర ట్రైలర్ నూ..మెగాస్టార్‌ చిరంజీవి, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటించారు. ‘ ఒక లయన్ కి.. టైగర్ కి పుట్టాడు సర్ నా బిడ్డా.. క్రాస్ బ్రీడ్’ అంటూ రమ్యకృష్ణ చెప్పిన పూరి మార్క్ డైలాగ్ పేలింది….

Read More

క్రికెట్ కెరీర్ పై మిథాలీ కీలక వ్యాఖ్యలు!

భారత మహిళాల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ తన కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన సుదీర్ఘ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ ముగింపునకు వచ్చేసిందని మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌ కల మాత్రమే ఇంకా మిగిలి ఉందని.. జట్టులోని సభ్యులంతా మెరుగ్గా ఆడితేనే…

Read More

‘రిపబ్లిక్ ‘ మూవీ విడుదల డేట్ అనౌన్స్ !

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్ట. తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ జోడి లో నటిస్తుంది.జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి స్పందన లభించింది….

Read More

గుజరాత్ మున్సి’పోల్స్’ లో భాజపా ప్రభజనం!

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం  ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ…

Read More
Optimized by Optimole