ఎస్ఈసీ మాటలు వింటే చర్యలు తప్పవు: మంత్రి రామచంద్రా రెడ్డి

ఎస్ఈసీ(ఎన్నికల కమిషనర్) మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే,బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్లు, పంచాయతీ ఎన్నికల అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేము ఎన్నికల కమిషనర్ మాట వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి అన్నారు. కాగా చిత్తూరు, గుంటూరు లో ఏకగ్రీవాలు అపమని ఎన్నికల కమిషనర్ అంటున్నారు. అందుకు సహకరిస్తూ, తొత్తులుగా పనిచేసే అధికారుల అందరిని గుర్తుపెట్టుకుంటామని…

Read More

ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘ ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కి ధన్యవాదాలు ‘ అంటూ దాదా ట్వీట్ చేశాడు. ఇటీవలే చాతి నొప్పితో ఆసుపత్రి పాలైన దాదా , కోలుకున్న తర్వాత చేసిన మొదటి ట్వీట్ ఇదే కావడం…

Read More

జమ్మూలో భారీ ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం!

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియలో భాగంగా కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్‌ దేవ్‌సర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు…

Read More

Modi:పదేళ్ల పాలన ట్రెయిలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటున్న మోదీ

Nancharaiah merugumala senior journalist: ఇది ట్రెయిలర్‌ మాత్రమే, అసలు పని పూర్తవ్వాలంటే ఇంకా సమయం కావాలి:మోదీ ‘ ప్రధానమంత్రిగా నా పదేళ్ల కృషి కేవలం ట్రెయిలర్‌ మాత్రమే, ఇంకా నేను ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది, ’ అని నరేంద్రమోదీ మంగళవారం అహ్మదాబాద్‌ లో ప్రకటించారు. మరి ‘మిగిలిపోయిన పనులు’ పనులు పూర్తి చేయడానికి భారత ఓటర్లు మరో పదేళ్లు ప్రధాని కుర్సీలో మోదీని ఉండనిస్తే…చివరాఖరుకు (2034) ఆయన 84 సంవత్సరాల దగ్గరకు చేరుకుంటారు….

Read More

కోహ్లీని దాటేసిన బాబ‌ర్ అజామ్‌!

ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్లో కోహ్లీ అధిప‌త్యానికి తెర‌ప‌డింది. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్, కోహ్లీని వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానంలో నిలిచాడు. కోహ్లీ సుమారు మూడున్న‌రేళ్ల పాటు అగ్రస్థానంలో కొన‌సాగాడు. బుధ‌వారం ప్ర‌క‌టించిన ఐసీసీ ర్యాకింగ్స్‌లో బాబ‌ర్ 865పాయింట్ల‌తొ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ (857) ద్వితియ‌, రోహిత్ శ‌ర్మ (825) పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌లో జావేద్ మియందాద్‌, జహీర్ అబ్బాస్ ల‌త‌ర్వాత వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరుకున్న నాలుగో ఆట‌గాడిగా…

Read More

Telangana:విత్తనం మూలం ఇదం జగత్ నినాదాన్ని ప్రాచుర్యంలోకి  తీసుకురావాలి..

Khadtal:  కల్తీ విత్తనాల నిర్మూలన, రైతుకే విత్తన హక్కు అన్న అంశాలకు చట్ట రూపం ఇచ్చి దానిని అమలుపరిచినప్పుడే  దేశీ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయం  రైతు సంక్షేమ కమిషన్ చైర్ పర్సన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 20 అంశాలతో…

Read More

PawanKalyan: నాకు జీవితంలో ధైర్యం నింపింది పుస్తకాలే: పవన్ కళ్యాణ్

Vijayawada:  ‘నాకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలే. నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలే. 2047కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞానకాంతులు నిండే సమూహం అవసరం. అందుకు పుస్తకాలు దారి చూపుతాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  అన్నారు. రేపటి యువత సాహితీ సంపదను కాపాడేలా తయారు కావాలన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన సాహితీయాత్రను మొదలుపెట్టబోతోందని చెప్పారు. తెలుగుభాషకు వన్నెతెచ్చిన గొప్ప సాహితీ…

Read More

బీజేపీ వీరాభిమాని మృతిపై యోగి సర్కార్ సీరియస్.. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశం!

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వీరాభిమాని బాబర్ హత్యపై సీఎం యోగి స్పందించారు. దారుణానికి పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాబర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు.. అత్యున్నత దర్యాప్తునకు అదేశిస్తునట్లు సీఎంవో ట్విట్ ద్వారా వెల్లడించింది. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబర్ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు.. ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడంతో కొంతమంది స్థానికులు…

Read More

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు?: నాదెండ్ల మనోహర్

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు • ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు? • అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు • లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు • మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి • పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి • నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన…

Read More
Optimized by Optimole