చెన్నైని గెలిపించిన ధోని!

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై జట్టు ముంబై పై గెలిచింది. మరోవైపు ఈ మ్యాచ్​తోనైనా టోర్నీలో బోణీ కొట్టాలని భావించిన ముంబయికి చుక్కెదురైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ జట్టులో తిలక్‌ వర్మ (51) అర్ధశతకం మెరిశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (32), హృతిక్‌ షోకీన్‌…

Read More

GHMC: పేదల పొట్ట కొట్టడం జీహెచ్ ఎంసీకి తగునా..?

Hyderabad:  ఏ తల్లయినా తన పిల్లలను తానే చంపుకుంటుందా? జీహెచ్ఎంసీ అలాంటి పనే చేసింది! రామంతాపూర్ లో రోజూ 300 మంది ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్ ని సీజ్ చేసింది. కారణం ఏంటో తెలుసా? విస్తార్లతో పక్కనే చెత్త పేరుకుపోతోందని!! రోజూ అన్నం తిన్న తర్వాత విస్తార్లను పక్కనే పాలిథిన్ సంచిలో ప్యాక్ చేస్తారు. కానీ, రాత్రిపూట కుక్కలు ఆ సంచిని చింపేస్తుండటంతో పొద్దున్నే చెత్త పేరుకుపోతోంది. దీంతో పారిశుధ్య కార్మికులకు ఆ చెత్తను తొలగించడం…

Read More

Religion: మూడు మతాలు.. ముగ్గురు స్త్రీలు.. మూడు అత్యాచారాలు..!

Religion: మతం నంబర్1 బెంగళూరుకు చెందిన ఆ మ‌హిళ‌ కేర‌ళ‌లోని పెరింగొట్టుకుర ఆల‌యానికి వెళ్లింది. అక్కడ ప్ర‌త్యేక పూజ‌లు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయ‌ని ఆమె ఆలోచన. ఆల‌యానికి వెళ్లిన స‌మ‌యంలో అక్కడున్న అరుణ్‌, ఉన్ని ద‌మోద‌ర‌న్ అనే పూజారులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పూజలు చేయిస్తామని వారు చెప్పడంతో ఆమె వారి నెంబర్ తీసుకుంది. ఆ త‌ర్వాత వారి నుంచి ఆమెకు వాట్సాప్ వీడియో కాల్స్ రావడం మొదలైంది. ఆమెతో వారు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించడం మొదలుపెట్టారు. తమ…

Read More

Telangana: సీఎం రేవంత్ నాయకత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: పటేల్ రమేష్ రెడ్డి

Telangana:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ లగచెర్ల లో కలెక్టర్ పై దాడి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్ది అమాయక ప్రజలను రెచ్చగొట్టారని.. కేటీఆర్…

Read More

కేంద్ర బడ్జెట్ లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్

వికారాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  వికారాబాద్  జిల్లా పచ్చిమ ప్రాంత ప్రజలు..  రాజధానికి వెళ్ళాలన్న.. జిల్లా కేంద్రానికి రావాలన్న ప్రధాన రహదారి పై రైల్వే క్రాసింగ్  ఉండడం వలన ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధులు.. సంబంధిత అధికారులు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్…

Read More

Razakar: ” రజాకార్” తర్వాత విసునూరు తీస్తారా?

విశీ ( సాయి వంశీ) : సరైన పుస్తకాలు చదవకుండా, కేవలం సినిమాలు చూసి వాటినే అసలైన చరిత్ర అని ఉద్రేకపడేది మనమే! ఈ కారణంగానే మనకు బోలెడంత మంది చారిత్రక పురుషులు, మగ స్వాతంత్ర్య సమరయోధుల సినిమాలు వచ్చాయి. వారి దృష్టికోణం ఎలా ఉంటే మనకు స్వాతంత్ర్యం అలా అర్థమైంది. We deserved it. చరిత్ర పట్ల గౌరవం, ఉత్సాహం లేక వాట్సప్‌ని మాత్రమే నమ్ముతున్న మనకు ఇలా జరగాల్సిందే! ఇప్పుడు ‘రజాకార్’ సినిమా వస్తుంది….

Read More

JammuKashmir: జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు..!

JammuKashmir: జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మూడు విడతలలో ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన సంస్థ బృందం ఎన్నికల ఫలితాలపైనే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కూడా రాష్ట్ర ప్రజల…

Read More

Telangana: పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ..!

Telangana: రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే బలమైన ఆర్థిక పునాదులుండాలనే దృఢమైన సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెండడమే కాకుండా ప్రధానంగా ఉపాధి రంగం కూడా మెరుగుపడే అవకాశాలుండడంతో ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతం అవుతున్నాయి. తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్గా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఏడాది కాలంగా తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటీ సఫలీకృతం కావడం అభినందనీయం. ఇప్పటికే అన్ని రంగాలను ఆకర్షిస్తున్న…

Read More

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు..?

హైదరాబాద్: ప్రముఖ టీ న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. రామ్ నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఆమె శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని సమగ్రంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ మహిళా జర్నలిస్టు—స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానెల్ లో…

Read More
Optimized by Optimole