ప్రభాస్ ‘సలార్ ‘లో పృధ్వీ రాజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కేజీఎఫ్’​ ఫేం ప్రశాంత్​నీల్​ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్​’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. మలయాళ స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్​ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్​ విన్న వెంటనే తన పాత్ర నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పేసుకున్నారని ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభాస్ చెప్పుకొచ్చారు. కాగా ఇందులో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన…

Read More

Poetry: నిన్నను క్షమించేద్దాం..!

Poetry:  నిన్నను క్షమించేద్దాం రేపటి రోజును నాశనం చేసే అవకాశాన్ని నిన్నకు ఇవ్వొద్దు. బాస రూపుమాసిపోతుంది. గొంతు ఊగిసలాడుతుంది. రాలిన ఆకుల చప్పుళ్లతో చెవులు గింగురుమంటుంటాయి. పొద్దు పొడిచే లోపే అవకాశానికి ఆటంకం ఎదురవుతుంది. నిన్నటి రోజును దాని మానాన గడచిపోనిద్దాం. కాలజాలంలోని కలనేతను కాసింత సడలించుదాం. రేపటి రోజును అదుపు చేయవద్దని నేటిని వేడుకుందాం. వెనుదిరిగి చూడనే చూడొద్దు. ఇక నిన్ను నడిపించేది నీ సంకల్పమే! — బాస్క్‌ మూలం: వీ ఫ్లమింగో స్వేచ్ఛానువాదం: పన్యాల…

Read More

అష్టాదశ శక్తి పీఠాలు విశిష్టత..

పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. పురాణ కథ : ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి)…

Read More

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకు?: పవన్ కల్యాణ్

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఉలిక్కిపాటు ఎందుకని? ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలు జగన్ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవ చేశారు.ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న…

Read More

కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు తక్కువే : ఐసిఎంఆర్

భారత్​లో కరోనా థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశం ఎంత మేర ఉంది? ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటాం? వీటన్నిటికీ ఐసీఎంఆర్ చెప్తున్న సమాధానం ఏమిటీ? కరోనా సృష్టించిన బీభత్సానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. దానికి తోడు.. ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు’ చందంగా సెకండ్ వేవ్ కోలుకోలేని దెబ్బతీసింది. అంతేకాక మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో భయంతో జనం వణికిపోతున్న తరుణంలో ఐసిఎంఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడో దశ వచ్చేందుకు అవకాశాలు…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అటు తెలంగాణలో 25వేల 21 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లోనే 55 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు.అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా,అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఏపీలో 39వేల 848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది….

Read More

రసెల్ మెరుపులు.. కోల్ కత్తా సునాయస విజయం..!

ఐపీఎల్ 2022 టోర్నీలో కోల్‌కతా రెండో విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించి.. 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కోల్ కత్తా బౌలర్ల ధాటికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో భనుక రాజపక్స (31) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కగిసో రబాడ (25) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా…

Read More

తాజాగా మరో వేరియంట్ వెలుగులోకి..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో డెల్టా, డెల్టాప్లస్​, వంటి వేరియంట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్తరకం వేరియంట్ ‘లాంబ్డా’​ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్​ ఇప్పటివరకు 29 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. బ్రిటన్​లో ఇప్పటివరకు ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. లాంబ్డా వేరియంట్ తొలుత గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్​, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్…

Read More
Optimized by Optimole