Headlines

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం..!!

ఎడతెరిపిలేని వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్నిజిల్లాలో రెడ్‌ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. ఏకధాటి వర్షాలకు కేరళలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎర్నాకులం జిల్లాలో కొండచరియలు…

Read More

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏకాదశి గురించి మరి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. భవిశ్యోత్తర పురాణం: వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే…

Read More

బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం బీజేపీ గొప్పదనం : పవన్

Telanganaelections2023: ‘సమాజంలోని అన్ని వర్గాలకీ అధికారం అందాలనే బలమైన లక్ష్యంతో 2009 నుంచి పోరాటం చేస్తున్నామన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.  తెలంగాణలో బీజేపీ కూడా అదే ఆశయంతో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల నుంచి  ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన జనసేన – బీజేపీ సంయుక్త ప్రచార సభలో పవన్  పాల్గొని ప్రసంగించారు. ఆయనతో…

Read More

EXITPOLLS2024: తెలుగు ఓట‌రు నాడిపై ఎగ్జిట్ పోల్స్‌ అంచ‌నాలు…ఎక్స్‌క్లూజివ్

EXITPOLLS2024: నేడు వెలువ‌డ‌నున్న తెలుగు రాష్ట్రాల( ఏపీ అసెంబ్లీ , పార్ల‌మెంట్‌.. తెలంగాణ పార్ల‌మెంట్‌) ఎన్నిక‌లకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది . వివిధ స‌ర్వే సంస్థ‌లు, మీడియా ఛాన‌ల్స్ విడుద‌ల చేసిన‌ ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలను newsminute24 ఎక్స్ క్లూజివ్ గా మీకోసం అందిస్తుంది.        AP ASSEMBLY EXIT POLLS- 2024                    …

Read More

Rammandir : 500 ఏళ్ల స్వప్నం సాకారంకాబోతోంది.!

AyodhyaRammandir:  500 వందల ఏళ్ల స్వప్నం.. వేల మంది త్యాగం.. కోట్లాది మంది చిరకాల వాంఛ.. సాకారమయ్యే శుభ తరుణం రానే వచ్చింది. మరి కొద్ది గడియల్లో హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య  శ్రీరాముడికి  ప్రాణ ప్రతిష్ట  జరగబోతోంది. అతిరథ మహారథులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు నిర్వాహకులు భారీగా  ఏర్పాట్లు చేశారు.ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా దేశం నలుమూలలనుంచి వచ్చిన పాధువులు, పండితులతో పాటుగా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు…

Read More

Music: బిందుమాలిని – ఓ సంగీత దర్శకురాలి ప్రస్థానం..!

సాయి వంశీ ( విశీ) :  2016లో తమిళంలో ‘అరువి’ అనే సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. టైటిల్ పాత్ర పోషించిన అదితి బాలన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రజనీకాంత్ అంతటి నటుడు ఆమెకు ఫోన్ చేసి చాలా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. తమిళం తెలియనివారు సైతం ఆ సినిమా వెతుక్కుని మరీ చూశారు. 2018లో కన్నడలో ‘నాతిచరామి’ సినిమా విడుదలైంది. శ్రుతి హరిహరన్, సంచారి విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించీ…

Read More

literature: ‘ఇర్లచెంగి’.. భలే భలేటి కథల మనిషి..!

సాయి వంశీ:   తెలుగులో ఆడవాళ్లు తమ బాల్య జ్ఞాపకాలు కథలుగా రాయడం అరుదు. నాకు తెలిసి సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కతలు’, పొత్తూరి విజయలక్ష్మి ‘నోస్టాల్జియా’, మన్నం సిందుమాధురి ‘ఉళైనూరు క్యాంపు కతలు’ రాశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జూపాక సుభద్ర తన బాల్య జాపకాలు రాస్తున్నారు. అలాగే కొన్ని కథల్లో ఎండపల్లి భారతక్క తన బాల్యం గురించి రాశారు. (ఇంకెవరైనా రాసి ఉంటే మెన్షన్ చేయండి). చిత్తూరు జిల్లాలో పుట్టిన ఆచార్య మహాసముద్రం దేవకి గారు…

Read More

కేసిఆర్ మరోసారి దళితులను మోసం చేశారు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని మండిపడ్డారు.దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు…

Read More

Telangana: “KTR మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు”: గజ్జల కాంతం

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం తీవ్రంగా స్పందించారు. “కేటీఆర్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారు,” అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ, రోడ్లపై చర్చలకు సవాళ్లు చేయడం ఏంటని గజ్జల కాంతం ప్రశ్నించారు. “సరే, రోడ్ల పైనే చర్చిస్తే, కేటీఆర్‌కి ఎమ్మెల్యే…

Read More

Delhi: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

News Delhi: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిలో కొనసాగేందుకు రాజ్యాంగబద్ధ హక్కు ఉందని పేర్కొంది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంతో జీవించే హక్కు ఉందని, అదే హక్కు…

Read More
Optimized by Optimole