×

మహారాష్ట్రలో ఏక్ నాథ్ శిందే ప్రభుత్వం కొలువుదీరింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత శిందే..బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి పతనమవడానికి అసలు పాత్రధారి ఎవరూ? ప్రభుత్వం కూలిపోవడానికి వ్యూహా రచన ఎవరు చేశారు?అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గడంలో ఎవరి పాత్ర ఏంటన్నది శిందే మీడియాతో పంచుకున్నారు. సినిమా తలపించేలా రక్తికట్టించిన మహాడ్రామా చివరకు ఎలా ముగిసిందో తెలుసుకుందాం!

గత నెలలో మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన పై ఏక్ నాథ్ శిందే తిరుగుబాటు చేశారు. ఆయనతో పాటు అతని వర్గం ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టారు. అయితే కొత్త ప్రబుత్వం ఏర్పాటులో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య భూమిక పోషించినట్లు శిందే వెల్లడించాడు. మహాడ్రామాలో ఫడ్నవీస నూ జగన్నాటక సూత్రధారిగా ఆయన అభివర్ణించారు. విశ్వాసపరీక్ష రోజు అతను వ్యవహరించిన తీరుతో.. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొదని నిర్ణయించుకుంటున్నట్లు శిందే చెప్పుకొచ్చాడు.

ఫడ్నవీస్ తో  ఎమ్మెల్యేల రహస్య సమావేశం..

శివసేనపై తిరుగుబాటు అనంతరం తిరుగుబాటు ఎమ్మేల్యేలంతా కలిసి గౌహతిలోని లగ్జరీ హోటల్లో బసచేసినట్లు శిందే తెలిపారు. ఆతర్వాత బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎమ్మేల్యేలంతా సమావేశమైనట్లు తెలిపాడు. విశ్వాస పరీక్ష రోజు ఉదయమే 40 మంది ఎమ్మేల్యేలతో కలిసి ముంబై చేరుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇక విశ్వాసపరీక్షకు ముందు ప్రధాని తమను ఆశీర్వదించినట్లు శిందే పేర్కొన్నాడు. అవసరమైతే సహయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అమిత్ షా మీవెన్నంటి ఉంటారని ప్రధాని అన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే మహాడ్రామా చిక్కుముడి వీడటంలో..దేవేంద్రుడు ముఖ్యభూమిక పోషించినట్లు షిందే కుండబద్దలు కొట్టాడు. అతని నిర్ణయాలు ఎవరికీ అంతుపట్టవని..విశ్వాసపరీక్షలో నెగ్గడంలో అతని వ్యూహరచనలు అద్భుతం అంటూ కొనియాడారు షిందే.

 

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra: సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు… మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా? మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ...

Read out all

Keralaelection: కమ్యూనిస్టు కూటమికి కేరళలో ఎదురీత…!

Kerala: దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక...

Read out all
Optimized by Optimole