‘యువ గళం ‘ పాదయాత్రకు అపూర్వ స్పందన..

కుప్పం: కుప్పంలో నారా లోకేష్ ‘ యువ గళం ‘ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా సాగింది. యాత్రకు మద్దతుగా.. రైతులు, విద్యార్దులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన టొమాటో లు రోడ్ల మీద పారబోసే పరిస్థితి దాపురించందన్నారు.ఎరువులు ధరలు పెరిగిపోయాయి..డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ఎత్తేసారు…..

Read More

కెసిఆర్ హామీలన్నీ నెరవేర్చారు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఎనిమిదేళ్ళ పాలన లో సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు, 4కోట్ల 24 లక్షల చెక్ లను పంపిణీ చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే టీ.ఆర్.ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు…

Read More

కలశాన్ని ఎందుకు పూజించాలి?

  కలశము అంటే ఏమిటి? నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్ర “కలశం” అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి…

Read More

అభినవ సత్యభామ ఇక లేరు…

మాజీ ఎంపి, బిజెపి నాయకురాలు..తెలుగు చలనచిత్ర రంగంలో అభినవ సత్యభామగా పేరొందిన సీనియర్ నటి జమున ఇక లేరు. వయసు రీత్యా హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో  శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆమె మృతి పట్ల.. అభిమానులు  ప్రముఖులు..నటులు..రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. స్వస్థలం.. అందం.. అభినయం..నటనతో జనహృదయాలను గెలుచుకున్న జమున స్వస్థలం కర్ణాటక. ఆమె 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు..గుంటూరు…

Read More

తమిళ గమళ్ల గవర్నర్‌ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………. తమిళ గమళ్ల (నాడార్‌ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్‌ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్‌ (గైనకాలజిస్ట్‌ ఆమె). ఆమె రాజ్యపాల్‌ గా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లు…

Read More

నల్గొండ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రావు IPS

నల్లగొండ: నల్లగొండ జిల్లా ఎస్పీగా అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి రామగుండం సి.పి గా బదిలీపై వెళ్ళారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం..జిల్లా ఎస్పీ కార్యాలయంలో అపూర్వ రావు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు.. ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పుష్పంగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర…

Read More

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బిజేపి స్టేట్ చీఫ్ బండి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. మహిళలను నేరుగా కలిసి.. ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోవాలని సూచించారు….

Read More

హిందూ దేవతలను కించ పరిస్తే సహించేది లేదు: జనసేన పవన్

సెక్యూలరిజం ముసుగులో హిందూ దేవతలను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అన్ని మతాలను సమానంగా చూసే దృక్పధం ప్రతి ఒక్కరూ అలవరచు కోవాలని పిలుపునిచ్చారు. ఒక మతం వారిని పదే పదే అవమానపరిస్తే…వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని జన సేనాని మండిపడ్డారు. కాగా ఇటీవల హిందు దేవతల మీద దూషణలు…

Read More

లోకేష్ ‘ యువగళం ‘ క్రేజ్ పీక్స్.. మేము సైతం అంటూ ‘ యువత ‘..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘ యువగళం’ పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ధ్వంస‌మైన ఆంధ్రప్రదేశ్ పున‌ర్మిర్మాణమే ల‌క్ష్యంగా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలో మీటర్ల మేర యాత్ర జరగనుంది. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా మధ్య మధ్యలో రోడ్ షో..సమావేశాలు నిర్వహించనున్నారు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా యువత పెద్ద సంఖ్యలో లోకేశ్…

Read More

లైంగిక బాధిత మ‌హిళ‌లకు తక్షణ ఆర్ధిక సహాయం: ఎస్పీ రెమా రాజేశ్వరి

న‌ల్ల‌గొండ‌:  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా .. లైంగిక వేధింపుల ద్వారా మోస‌పోయిన  మ‌హిళ‌లకు  పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో త‌క్ష‌ణ‌ ఆర్థిక స‌హాయం అంద‌జేశామ‌న్నారు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. బాధిత మ‌హిళ‌లకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ .. ప్రజలకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించిన ఎస్పీ.. 10 మంది మ‌హిళ బాధితుల‌కు.. ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందన్నారు. బాధిత…

Read More
Optimized by Optimole