తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయం’’..

Telanganapolitics: తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయాలు’’ తిరుగుతున్నాయి. ఓడెక్కే వరకు ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడ మల్లన్న. అన్నట్లు బీసీల పట్ల రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అగ్ర కులాల  వారు రెండు దశాబ్దాలుగా రాజ్యాధికారం చేపడుతున్నారు. కానీ జనాభాలో 50 నుంచి 60 శాతం ఉన్న బీసీలు రెండు అక్కెన్ల పరిధిలోపు అసెంబ్లీకి పరిమవుతున్నారు. దీనికి కారణం అధికారం చేజిక్కించుకుంటున్న రాజకీయ పార్టీ వాళ్లది తప్పా..? రాజ్యాధికారం చేజిక్కించుకోవడంలో వెనుకబాటులోఉంటూ వస్తున్న బీసీలది తప్పా..? అంటే సమాధానం…

Read More

ప్రజాదరణలో లోక ‘ నాయకుడు’ మోదీ..!

ప్రధాని మోదీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతావని మరోసారి ఆయన నాయకత్వం  కావాలని కోరుకుంటున్నట్లు  వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది.తాజాగా మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలోనూ అదే విషయం తేటతెల్లమైంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచినట్లు సంస్థ ప్రకటించింది. 22 మంది ప్రపంచ నాయకులపై సంస్థ సర్వే నిర్వహించగా..76 శాతం రేటింగ్ తో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ లో మోదీ తొలి…

Read More

ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. అతను నటిస్తున్న మొదటి చిత్రం ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైష్ణవి జోడిగా కన్నడ బ్యూటీ కీర్తి శెట్టి నటిస్తుండగా , ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్…

Read More

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

పింఛన్ లబ్ధిదారులకు  దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  ఎన్ఐఏ  చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలని కోరారు. అవసరమైతే తాను సైతం లేఖ రాస్తానని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ విమర్శించారు….

Read More

రాజ్ కుంద్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా రాజ్‌కుంద్రా..ఈజీ మనీ కోసమే ఆయన ఈ పోర్నోగ్రఫీవైపు వెళ్లారా..ఇంకా ఎవరెవరికి దీంతో ప్రమేయం ఉంది అనేది తేల్చేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా గురించి మరిన్ని విషయాలు ప్రస్తుతం బయటకొస్తున్నాయి. ముంబయి శివారులోని…

Read More

tribalsociety: గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ

Raparthy vinod Kumar: అంతరాలను పూడ్చటమే కాదు… వారి వారసత్వం, గిరియువత సాధికారత లక్ష్యం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ.. అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత నిర్లక్ష్యం అనంతరం వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. అంతరాలను పూడ్చడమే కాకుండా.. ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత,…

Read More

కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్న..ప్రజాభిప్రాయం మేర రాజీనామా: రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే  నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా…

Read More
Optimized by Optimole