Headlines

హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్‌ 25 నుండి 30 .. ఆమ్‌ఆద్మీ 1 నుండి 2, ఇతరులు 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అక్టోబర్‌ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్‌ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీ, పొలిటికల్‌ సైన్స్‌…

Read More

Emchestunnav: ఏం చేస్తున్నావ్ రివ్యూ .. ” అచ్చమైన ప్రేమ కథ ”

విశీ(వి.సాయివంశీ): నాలుగు ప్రేమలు ఉన్న అచ్చమైన ప్రేమకథ..!  ‘ఏం చేస్తున్నావ్?’ ఏం చేస్తాం? పెద్దలైతే కాలక్షేపం చేస్తారు. పిల్లలైతే అల్లరి చేస్తారు. అమ్మానాన్నలు పనులు చేస్తారు. మరి అప్పుడే కాలేజీ ఏజ్ దాటిన కుర్రకారు ఏం చేస్తారు? కొలువు. అదే వారికి నెలవు. అంతేనా? అంతకుమించి ఏమీ లేదా? ఉండకూడదా? ‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు అబ్దుల్ కలాం. దాన్ని మనవాళ్లు మరోలా వ్యాఖ్యానించుకున్నారు. ‘ఫలానా కలలే కనండి.. ఫలానా మార్కులొస్తే అవే మీకు మీ కలల్ని…

Read More

దీదీ ప్రమాదవశాత్తు గాయపడింది: ఈసీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడి విషయమై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేశారు. దీదీ పై  ఎలాంటి దాడి  జరగలేదని, ప్రమాదవశాత్తు జరిగిందని నివేదికలో పేర్కొంది. దాడి సమయంలో దీదీ వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉందని, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.  కాగా ఈనెల 10న నందిగ్రామ్ లో  ఎన్నికల  ప్రచారంలో  దీదీ కాలికి గాయం అయినా విషయం తెలిసిందే.. ఈ విషయం లో బీజేపీ ,తృణమూల్ మాటల…

Read More

చంద్రబాబు కష్టాలకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా?

Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!) ============= 2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు….

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

కార్తీక మాసమహాత్మ్యం .. నాగుల చవితి విశిష్టీత..!!

ప్రకృతి మానవు మనుగడకు జీవధారమైనది.దీంతో ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న చెట్టు,పుట్ట,రాయి, కొండ ,కోన,నది, పర్వతాన్ని చెప్పుకుంటూ పోతే సమస్త ప్రాణకోటిని దైవస్పరూపంగా భావించి పూజించడం అనవాయితీగా వస్తోంది.ఇది భారతీయ పండగలోని విశిష్టతకు నిదర్శనదమని పురాణాలు చెబుతున్నాయి .ఇందులో భాగంగానే “నాగుపాము”ను దేవుడిగా భావించి పూజించడం సంప్రదాయం. ముఖ్యంగా కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. కార్తీక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. నాగుల…

Read More

కాంగ్రెస్‌ హైకమాండ్‌–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?

Nancharaiah merugumala senior journalist:( కాంగ్రెస్‌ హైకమాండ్‌–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?రేవంత్‌ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ==================== తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్‌ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు…

Read More

కోవిడ్ తో వేలమంది బాలలు అనాధలు!

దేశంలో కోవిడ్ వలన అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేల మంది కరోనా కాటు గురై మరణించారు. తద్వారా.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి.. అనాథలైన బాలలు ప్రస్తుతం వేలమంది. కరోనా కారణంగా 1,882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7,464 మందిగా..సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సంఘం వివరాలను పేర్కొంది. ఏడాదిన్నరగ.. కొవిడ్‌ కారణంగా 9,346 మంది పిల్లలు ఏదోరకంగా…

Read More

మిస్ సౌత్ ఇండియా ఛరిష్మా కృష్ణ(ఫోటోస్)..

విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం గెలుచుకుంది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచారు. తమిళనాడు కి చెందిన డెబినీతా కర్, కర్ణాటక కి చెందిన సమృద్ధి శెట్టి రన్నరప్‌ లు గా నిలిచారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, పెగసుస్ సంస్థల ప్రతినిధులు Dr. అజిత్ రవి…

Read More
Optimized by Optimole