Vikarabad: బీజేపీలో మాంసాహారులకు స్థానం లేకపోతే పార్టీ ఎలా బలపడుతుంది?: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్: “మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదని ఎవరైనా భావిస్తే, అలా బీజేపీ ఎలా బలపడుతుంది?” అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మీకు దేశభక్తి ఉంటే, దైవభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళ్‌లలో చేరండి. బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో ఉండే అర్హత మీకు ఉండదంటూ” తీవ్ర స్థాయిలో…

Read More

సిఐడి మాజీ చీఫ్ అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

సిఐడి మాజీ చీఫ్ బలవంతపు అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపించి… దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజులు ఎవరని ఆయన ప్రశ్నించారు. వ్యాపార సంస్థలపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేయగానే.. ఆ సంస్థల యాజమాన్యాలను ఎందుకు కలిశారని నిలదీశారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, ఇతర ఆర్థిక నేరాల…

Read More

టీఎంసీ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతుంది : జేపీ న‌డ్డా

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అద్భుత ఫ‌లితాలు సాధిస్తుంద‌ని భాజాపా జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ధీమా వ్య‌క్తం చేశారు. ఆదివారం ఓవార్త సంస్థ ఇంట‌ర్య్వూలో ఆయ‌న మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ప‌శ్చిమ్ బెంగాల్లో రాబోయే రోజుల్లో బీజేపి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుందని.. అసోంలో అధికారాన్ని నిల‌బెట్టుకుంటాం. తమిళనాడులో అధికార కూటమిలో కీలకంగా ఉంటామని.. పుదుచ్చేరిలో అధికారాన్ని చేజికిచ్చుకుంటాం. కేరళలో కీలకంగా నిలుస్తామని న‌డ్డా పేర్కొన్నారు. ఓట‌మి భ‌యంతో టీఎంసీ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 53 కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి 135 మంది కోలుకున్నారు. మహమ్మరి తో ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదుకాగా..కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క…

Read More

కర్ణాటక పోలింగ్ అనంతరం పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు..

Karnatakaelections2023: కర్ణాటక ఎన్నికల్లో విజయం ఏ పార్టీ వరిస్తుందన్న ఉత్కంఠకు 24 గంటల్లో తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా రీసెర్చ్ సంస్థలు వెలువరచనున్నాయి. ఈనేపథ్యంలోనే పీపుల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి..బుధవారం సా॥ 6.30 గం॥లకు, ఢిల్లీలోని  తెలంగాణ భవన్లో ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ పోస్ట్ , పీపుల్స్ పల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను మీడియా వేదికగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు….

Read More

అభినవ సత్యభామ ఇక లేరు…

మాజీ ఎంపి, బిజెపి నాయకురాలు..తెలుగు చలనచిత్ర రంగంలో అభినవ సత్యభామగా పేరొందిన సీనియర్ నటి జమున ఇక లేరు. వయసు రీత్యా హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో  శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆమె మృతి పట్ల.. అభిమానులు  ప్రముఖులు..నటులు..రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. స్వస్థలం.. అందం.. అభినయం..నటనతో జనహృదయాలను గెలుచుకున్న జమున స్వస్థలం కర్ణాటక. ఆమె 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు..గుంటూరు…

Read More

TirupatiLaddu:చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం చేయడం ఏమన్నా బాగుందా..?

Nancharaiah merugumala senior journalist:: జంతుకొవ్వు సంగతి సరే, వంటి మీద మూడొంతులు బట్టలు లేకుండా చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం లడ్డూలు చేయడం ఏమన్నా బాగుందా? పవిత్ర హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయంలో కనిపించే అపరిశుభ్రతను చూసి మహాత్మా మోహన్ దాస్ గాంధీ ఎంతగానో నొచ్చుకునేవారు. మందిరాల్లో మురికిని, శుచీశుభ్రంలేని పరిస్థితులను ఆయన పదేపదే ఎండగట్టేవారు. తనకు స్వాతంత్య్రం కన్నా పరిశుభ్రతే ముఖ్యమని బాపూ నొక్కిచెప్పేవారు. తెల్లారి లేస్తే గాంధీ పేరు…

Read More

ఆర్టీసీ బస్సులో సీఎం ఆకస్మిక తనిఖీ..

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. శనివారం చెన్నైలోని కన్నకి నగర్ వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సులో ఆకస్మిక తనిఖీ నిర్వ‌హించారు. ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి ప్ర‌జ‌లకు అందుతున్న సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులో అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు కార్య‌క్ర‌మం గురించి ఎలా భావిస్తున్నారని స్టాలిన్ మహిళా ప్రయాణికులను అడిగారు. బస్సుల్లో అదనపు సౌకర్యాలు అవసరమా అని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులతో మాట్లాడుతూ నగరంలోని స్థానిక…

Read More
Optimized by Optimole