Telangana: త్వరలో తీహార్ జైలుకు కేసీఆర్ కుటుంబం: గజ్జలకాంతం

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పీసీసీ నూతన ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. శనివారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. దళితుల వర్గీకరణను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు….

Read More

APNEWS: గ్రామాల్లో పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సిఎంపవన్

PawanKalyan:   ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏపీ లో కూటమి పాలన( ఎన్డీయే )మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఆయన  స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి…

Read More

ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read More

దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 వేల 091​ మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా 340 మందిమృతి చెందారు. ప్రస్తుతం దేశంలో లక్ష 38 వేల 556 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది….

Read More

supremecourt: చట్టం మార్పో? కొత్త చట్టమో..!

AntiDefectionAct: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడమో, మారిన పరిస్థితుల్లో మరో పకడ్బందీ చట్టం తెచ్చుకోవడమో అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న చట్టం, ఇదే రూపంలో… ఆశించిన ఫలితాలిచ్చే జాడ కనిపించట్లేదు. నిర్ణయాధికారం స్పీకర్దేనని, దానికి గడువు విధించలేమని న్యాయస్థానం తేల్చడంతో… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. పిటిషన్లపై నిర్ణయం…

Read More

మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!

రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్​ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌కు…

Read More

మోదీ @ 20 ఏళ్లు ప్రముఖుల విశ్లేషణతో రూపొందించిన పుస్తకం..

ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన ‘‘మోదీ @ 20 ఏళ్లు’’ పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం కరీంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ప్రిన్సిపాల్, రచయిత దాస్యం సేనాధిపతికి పుస్తక తొలి ప్రతిని అందజేశారు.  తన పార్లమెంట్…

Read More

Karimnagar: వినోద్ కుమార్ నీ దుకాణం బంద్: బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావు

BJPKarimnagar:  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. స్వయం ప్రకటిత మేధావి గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించిందేమీలేదని.. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినప్పటికీ వినోద్ కుమార్ బుద్ది మారలేదని మండిపడ్డారు. జనం మెచ్చిన నాయకుడి పై విషం కక్కుతూనే ఉన్నారని.. బండి…

Read More
Optimized by Optimole