×

మునుగోడు ఉప ఎన్నిక సమరం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ లేఖను రాజగోపాల్ స్పీకర్ పోచారంకు సమర్పించడం..ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. తన రాజీనామాతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భావించి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని .. ప్రజల కోసం చేసే యుద్ధమంటూ రాజగోపాల్ ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు.

ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామకు ముందు రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని .. తన రాజీనామాతో ఆయన దిగిరావడం ఖాయమంటూ కుండబద్ధలు కొట్టారు.మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు కనువిప్పుకలగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై అపాయింట్ మెంట్ అడిగితే కేసీఆర్ ఇవ్వలేదని.. ఉప ఎన్నిక రాగానే నియోజకవర్గ అభివృద్ధి గుర్తొచ్చిందన్నారు. తన సత్తా ఎంటో ఉప ఎన్నికలో చూపిస్తానని .. కేసీఆర్ కాచుకో అంటూ సవాల్ విసిరారు.

ఉప ఎన్నిక తీర్పుతో .. పడుకుంటే లేస్తే మునుగోడు ప్రజలు గుర్తు రావాలన్నారు రాజగోపాల్.ప్రజల పై నమ్మకం తో రాజీనామ చేస్తునట్లు ..దైర్యం లేకపోతే ఇంత సాహసానికి తెగించేవాడిని కాదన్నారు.ఇది తన కోసం చేసే యుద్ధం కాదని.. నియోజకవర్గ ప్రజల కోసం చేసే యుద్ధమని తేల్చిచెప్పారు. తన రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం వచ్చిందని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉందన్నారు.

టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని ఫైర్ అయ్యారు రాజగోపాల్. గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులా అంటూ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయ్యిందని .. ప్రజలు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. తన రాజీనామా పై సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని.. నిజానిజాలేంటో ప్రజలకు తెలుసని రాజగోపాల్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు రాజగోపాల్. ప్రజాసమస్యల కోసం ఎంతదూరమైనా వెళ్తానని.. సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వడానికి మునుగోడు ప్రజలు సిద్దంగా ఉన్నారని.. యుద్ధానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు .

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా...

Read out all

Telangana: “తుపాకీ నుంచి ప్రజాస్వామ్యానికి?”

సిద్ధార్థ (జర్నలిస్ట్): ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ నా చిన్నతనంలో తెలంగాణలోని కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై వాల్ రైటింగ్స్ కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా...

Read out all

Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్: నవమాసాలు మోసి ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించిన కష్టం విలువ తెలియని నీచ రాజకీయుల కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..! ఓట్లడిగే...

Read out all
Optimized by Optimole