BiharElection: బీహార్‌ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!

BiharElection: బీహార్‌ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్‌ రాష్ట్రానికి…

Read Full News

Delimitation: బీజేపీ నియంతృత్వ విధానాలకు పరాకాష్ట..డిలిమిటేషన్..!

Delimitation: -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు. ============= దేశ సమాఖ్య స్ఫూర్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడుగడుగునా తూట్లు పొడుస్తూ భిన్నత్వంలో ఏకత్వమైన మన జాతీయ సమైక్యతను నీరుగారుస్తోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా వివక్షతతో కూడిన ఎజెండాను అనుసరిస్తూ ఒంటెత్తు పోకడలతో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ విధానాలు పరాకాష్టకు చేరుకుంటున్న ప్రమాదకరమైన దశలో ఆ పార్టీ మెడలు వంచడానికి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా చేతులు కలుపుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించి దేశ…

Read Full News

Minorityvotes: ముస్లీం ఓట్ల చుట్టూ ముగ్గుపోత..!

Muslimvoters: పలు అస్తిత్వాలు, భాషా వైవిధ్యాలు, మత-కుల ప్రభావాల సంఘమంగా ఉన్న మహారాష్ట్ర ఎన్నికల సముద్రంలో రాజకీయ పార్టీలు ఎత్తుగడల ఈదులాటతో ఓట్లవేట మొదలెట్టాయి. ఎక్కడ? ఏ ఊతం పట్టుకుంటే, అధిక ఓట్లు దక్కి విజయతీరాలు చేరుతామనే వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. మూడేసి పార్టీలు జట్లు కట్టిన రెండు ముఖ్య కూటములు, ‘మహాయుతి’, ‘మహా వికాస్ అఘాడి’ (ఎమ్వీయే)లు ఇప్పుడిదే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక వ్యూహం, దాదాపు 12 శాతంగా ఉన్న ముస్లీం మైనారిటీల ఓట్ల చుట్టూ,…

Read Full News

Maharashtraelections: ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ‘మహా’ సంగ్రామం..!

Maharashtra elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఊపిరి పోస్తోంది. ఆర్ఎస్ఎస్ మీదా మేము ఆధారపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే.పీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల సమయంలో డాంభికాలు పలికినా ఆ పార్టీకి ఫలితాలు వాస్తవికతను తెలియజేశాయి. ఎన్నికల్లో ‘అబ్కీ బార్ 400 పార్’ నినాదం ఎత్తుకున్న బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేక 240 వద్దనే చతికిలపడింది. అనంతరం పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మొహన్ భగవత్ బీజేపీ…

Read Full News

Bandisanjay: జోడెద్దుల మాదిరి అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలా బడ్జెట్ రూపకల్పన: సంజయ్

Budget 2024: జోడెద్దుల మాదిరిగా అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు బడ్జెట్ ప్రతీకగా ఉందన్న ఆయన.. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే మోదీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ను రూపకల్పన జరిగిందన్నారు. బడ్జెట్ లో ఏకంగా 11 లక్షల 50…

Read Full News
bjp telangana,bjp,

BJP: ద‌క్షిణాదిన‌ పుంజుకున్న‌ బీజేపీ..

BJP:  ‘‘ఉత్తరాదికి చెందిన భారతీయ జనతా పార్టీ బలం దక్షిణాదిన నామమాత్రమే… హిందీ బెల్టు రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయించే బీజేపీకి ఇక్కడ ఉనికే లేదు…’’ అంటూ ప్రతిపక్షాలు, మేధావులుగా చెప్పుకునే రాజకీయ విశ్లేషకులు నిత్యం చేసే ప్రకటనలు తప్పని 2024 దేశ సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ ఈ ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కూడా గణనీయమైన ఫలితాలను సాధించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండీ’ నేతలు మరింత రెచ్చిపోయి…

Read Full News

Indianconstitution: భారత రాజ్యాంగాన్ని ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు!

Nancharaiah merugumala senior journalist: “భారత రాజ్యాంగాన్ని మొదట ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు! “ ఇందిరా గాంధీ 11 సంవత్సరాల పాలన తర్వాత, 21 నెలల (కొందరు 19 మాసాలని లెక్కిస్తారు) ఎమర్జెన్సీ అనంతరం…1977 మార్చ్ నెలలో నాటి ప్రతిపక్ష పార్టీలకు భారత రాజ్యాంగం, అందులోని ప్రాథమిక హక్కుల విలువ ఏమిటో అర్థమైంది. ఇందిరమ్మ పార్టీ నేత కాకపోయినా.. అమె అడుగుజాడలనే ఆదర్శంగా ఎంచుకున్న నరేంద్ర మోదీ దశాబ్ద పరిపాలన అనంతరం…

Read Full News

Ayodhya: అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేదు?

సాయి వంశీ ( విశీ) :  నిజమే! మొత్తం దేశానికి ఇదొక ప్రశ్న. రామమందిరం కట్టారు, బాలరాముణ్ని ప్రతిష్టించారు, ఊరూవాడా ఏకం చేసి సంబరాలు చేశారు. అయినా అక్కడ కమలం వికసించలేదు. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబా‌ద్‌ ఎంపీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 54,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంత భారీ ఆధిక్యంతో విజయం సాధించడం చిన్న విషయం కాదు. అసలు ఏం జరిగింది? కమలలోచనుడు ఎందుకు కమలం మీద శీతకన్నేశాడు? నిజానికి…

Read Full News

Modi: మే 8న వేములాడకు ప్రధాని మోదీ రాక?

Pmmodi: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం పంపింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు… 8 వ  తేదీ ఉదయం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటిస్తారు. ప్రధాని రాక సమాచారాన్ని అందుకున్న జిల్లా నాయకత్వం సభాస్థలి, ఏర్పాట్లపై ద్రుష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో…

Read Full News

BJP : ‘ మానసిక యుద్ధం’ తోనే బీజేపీ లక్ష్యం సాధ్యం..!

BJP: రాజకీయ యుద్ధంలో పట్టు సాధించాలంటే ప్రత్యర్థులను మానసికంగా బలహీనపర్చాలి… వైరి వర్గంలో విభేదాలు సృష్టించాలి… అని రాజనీతిజ్ఞుడు చాణక్యుడు చెబుతారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇవే సూత్రాలను అనుసరిస్తోంది. సొంతంగా 370కు పైగా, ఎన్‌డీఏ కూటమి 400కు పైగా స్థానాలు సాధిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వారు చెబుతున్నట్టు ఇన్ని స్థానాలు సాధించడం సాధ్యమా అని అధ్యయనం చేస్తే ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బెతీయడమే బీజేపీ లక్ష్యంగా కనబడుతోంది. ఆర్టికల్‌ 370…

Read Full News
Optimized by Optimole